ప్రముఖ సీనియర్ నటి మేనక కుమార్తె కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి కట్టుబొట్టు సాంప్రదాయ పద్ధతిలో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటికీ కూడా మహానటి అనే బిరుదు పొంది చలామణి అవుతున్న ఈమె ఎక్కువగా హీరోయిన్ పాత్రలకే కాదు చెల్లెలి పాత్రకి కూడా ప్రాధాన్యత ఇస్తూ పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే రజనీకాంత్ తో పెద్దన్నయ్య సినిమాలో రజనీకాంత్ కు చెల్లి పాత్రలో నటించి మెప్పించిన ఈమె తాజాగా తెలుగులో చిరంజీవి తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా చెల్లెలిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

మరొకవైపు నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.  ఈ సినిమా కూడా మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం ,హిందీ, కన్నడ , భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.  ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధిస్తే కనుక కీర్తి సురేష్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయినట్టే.. ఇదివరకే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ పాత్ర పోషించి అందరిని అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరొక గోల్డెన్ ఛాన్స్ అందుకుందని సమాచారం.

రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం జైలర్ . ఇందులో కీర్తి సురేష్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ప్రియాంక అరుల్ మోహన్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో రజనీకాంత్, కీర్తి సురేష్, ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు శివరాజ్ కుమార్ , వసంత్ రవి , రమ్యకృష్ణ,  వినాయకన్,  యోగి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: