పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే ప్రభాస్ ని సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామనకున్న ఫ్యాన్స్ అంచనాలు రోజు రోజుకు చాలా ఎక్కువవుతున్నాయి. ప్రభాస్ నుంచి మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరుకెక్కుతున్న ఆదిపరుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో పైగా మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా జస్ట్ టీజర్ రిలీజ్ నుంచే నెట్టింట విపరీతంగా బజ్ చేస్తోంది. ట్రోల్స్ రూపంలో ఇంకా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. ట్రోల్స్ తో పాటే సినిమాపై బజ్‌ కూడా పాన్ ఇండియా  రేంజ్లో ఫామ్‌ అవుతూనే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే న్యూస్ చెప్పి అంచనాలు పెంచేసింది ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్.


ఈ సినిమాలో చేసిన సీత రోల్ తనకు కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతుందని చెప్పుకొచ్చింది కృతి సనన్. తనకు ఈ మూవీతో మంచి పేరు ఖచ్చితంగా వస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. అయితే తాను రామానంద్ సాగర్ రామాయణాన్ని చూడలేదని కృతి తెలిపింది. ఆదిపురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల్లో రామాయణం గురించి  ఖచ్చితంగా అవగాహన పెరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు.అలాగే ప్రభాస్ నటిస్తున్న మరో సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ సినిమా కంటే ముందే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం తెలుస్తోంది.బాహుబలి సిరీస్ తో ప్రభాస్ నేషనల్ లెవెల్ లో ఊహకందని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తరువాత బాహుబలి రేంజిలో ఆదిపురుష్ సినిమాకి బజ్ పెరిగింది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా కూడా కొత్త రికార్డులు నమోదు చెయ్యడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: