హీరోగా తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన ఈయన హీరో గా దాని తర్వాత విలన్ గా కొన్ని సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అరవింద సమేత నేను లోకల్ వంటి సినిమాలు విలన్గా సైతం  నటించాడు. ఒకానొక సమయంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఎంతగానో బాధపడ్డారట నవీన్. కానీ మళ్ళీ సినిమాల్లో అవకాశం రావడంతో ఆ డిప్రెషన్ నుండి బయట పడుతూ

 ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి కమిట్ అవుతున్నాడు. అయితే నవీన్ చంద్ర నటించిన తాజా సినిమా మంత్ ఆఫ్ మధు. ఇక ఇందులో కలర్స్ స్వాతి హీరోయిన్గా మెప్పించడానికి రెడీగా ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ని చక చకా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూస్ ఇస్తూ వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ సైతం పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర నేను ఇండస్ట్రీకి వచ్చింది

ఆ సీనియర్ యాంకర్ వల్లే అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ సీనియర్ యాంకర్ మరెవరో కాదు ఒకప్పటి టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఉదయభాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె కనిపించడం లేదు. నవీన్ చంద్ర ఉదయభాను కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారా.. వారి మధ్య ఎటువంటి చెడు రిలేషన్ లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏం మొదట్లో ఒక డాన్స్ షో  కోసం నవీన్ చంద్ర వచ్చినప్పుడు మొదటిసారి ఉదయభానుని కలిసారట. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అంతేకాదు నవీన్ చంద్ర ఇండస్ట్రీకి రావడానికి ఉదయభాను ఎంతో ఇన్స్పిరేషన్ అని సైతం చెప్పుకొచ్చాడు. ఆ కారణంగానే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది అని చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: