గత వారం రోజులుగా మీ చౌంగ్ తుఫాను బారిన తమిళనాడు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్షాల కారణంగా చెన్నై నగరం కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది భారీ వర్షాల కారణంగా దాదాపుగా ఇప్పటికే 12 మంది పైగా మృతి చెందినట్లు సమాచారం. మరొకవైపు వరదల కారణంగా వేలాది మంది రోడ్ల పైన ఇబ్బంది పడుతున్నారు.. చాలామంది ఇల్లు లేకుండా బట్టలు లేకుండా ఆహారం లేకుండా చాలా అవస్థలు పడుతున్నట్లుగా చాలామంది సెలబ్రిటీలు సైతం వారికి తోచిన విధంగా సహాయాన్ని చేస్తూ ఉన్నారు.


చెన్నై బాధితుల కోసం నిత్యవసర సరుకులు కూడా అందిస్తూ ఉన్నారు.సినిమా తారలు కూడా అభిమానుల కోసం పలు రకాల చర్యలలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. అలా నయనతార కూడా తన వంతు సహాయాన్ని అందించింది. తన సంస్థ ఫెమి -9 ఆధ్వర్యంలో చెన్నైలో ఒక బ్రిడ్జి సమీపంలోని వరద బాధితులకు నిత్యవసర సరుకులను సైతం పంపిణీ చేసింది.. సానిటరీ జ్ఞాపకీండ్లు వాటర్ బాటిల్స్ భోజనాలు సదుపాయాలు కూడా అందించారు. దీంతో నయనతార పైన పలువురు నెటిజెన్లు అభిమానులు సైతం అభినందిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ఈమె పైన విమర్శలు చేస్తూ ఉన్నారు.


అయితే తమ బ్రాండ్ కు చెందిన ఫేమీ-9 కంపెనీకి చెందిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులో ఉన్న ప్రత్యేక వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడమే ఈమె పైన నెటిజన్లకు విమర్శలు చేయడానికి కారణం అవుతుంది తన అధికార సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహిళలను బలవంతంగా పెట్టి సిన్ చిత్రీకరించినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ప్రమోషన్ కోసమే ఇలా చేస్తున్నారంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ కష్ట సమయాలలో కూడా ప్రచారం చేస్తూ విజయ్ బృందం కూడా నిరుపేద ఆహారాలను అందిస్తున్నది అయినప్పటికీ కూడా చాలామంది నెటిజెన్స్ వీరిని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: