మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియదు అనే చెప్పాలి .. ఇక ఇప్పుడూ పలు సినిమాల ఫంక్షన్లకి చిరంజీవి గెస్ట్ గా వస్తుంటే సినిమా వాళ్లు ఆయన్ని పొగుడుతుంటే ఆ వైబ్‌ ని వాళ్ళు సరిగ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు .. కానీ కోలీవుడ్ లో ఇప్పుడు రజనీకాంత్ అనుభవిస్తున్న స్టార్ డమ్ కి 10 రేట్లు 18 ఏళ్ల క్రితమే చిరంజీవి అనుభవించి వచ్చారు అనేది చాలామందికి తెలియదు .. చిరంజీవి నుంచి సినిమా వస్తుంది అంటే థియేటర్ల వద్ద వందల సంఖ్యలో ప్రేక్షకులు కనిపించేవారు ..

బ్లాక్ లో 500 పెట్టి కొందామన్నా  టికెట్లు దొరికేవి కావు .. టికెట్లు దొరికిన వాళ్ళు అయితే జీవితంలో ఏదో సాధించినట్టు పండగ చేసుకునేవారు .. హిట్ సినిమాకి అయినా ఫ్లాప్ సినిమాకి అయినా  ఇదే మానియా ఉండేది .. సినిమా ఒరిజినల్ టాక్ బయటకు రావడానికి కనీసం వారం రోజులు పెట్టేది .. ఈ గ్యాప్ లో బయ్యర్స్ అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయేవారు .. అలా కొన్ని ప్లాప్ సినిమాలు కూడా చిరంజీవి మాస్‌ మాన్యాతో గట్టు ఎక్కేసేవి .. పూర్తిగా కాకపోయినా ఆల్మోస్ట్ ఇలాంటి కావులోకి వస్తుంది చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు అనే సినిమా .. చిరంజీవి హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్గా సాక్షి శివానంద్ ముఖ్య పాత్రలో వచ్చిన సినిమా ఇది ..


కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ..ఈ మూవీ 1999 ఏప్రిల్ 30న రిలీజ్ అయింది .. మొదటి షో తోనే ప్లాప్ టాక్‌ తెచ్చుకుంది చిరంజీవి ఇలాంటి సినిమా ఎలా చేశారు అంటూ అభిమానులు కూడా తెగ ఫీలయ్యారు .. అయినా ఇమేజ్ కి ఏమాత్రం మ్యాచ్ కానీ కథ ఇది చిరంజీవి సినిమాల్లో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో ఉండదు .. కానీ చిరు కే రాఘవేంద్ర కాంబినేషన్లో ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్‌లు వచ్చాయి. అలా ఈ సినిమా ఫాస్ మార్కులతో బయటపడింది .. అయినప్పటికీ 25 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది .. నిన్నటితో ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు వచ్చి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: