టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారుండారు. ఆయనకు యంగ్ స్టార్స్ నుండి ఏజ్ అయిన వాళ్లదాకా ఫాన్స్ ఉన్నారు. బాలయ్యకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. ఇక ఇటీవలే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా థియేటర్ లో విడుదల అయ్యి.. మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చెరిపోయింది.

అయితే బాలయ్య బాబు అఖండ 2: తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించనుంది. ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా అఖండ సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. అఖండ సినిమాకి పార్ట్ 3 కూడా ఉందని తెలుస్తోంది. బాలయ్య, శ్రీను కాంబోలో మరో సినిమా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ పార్ట్ 2 సినిమా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుందని సమాచారం. ఆ ట్విస్ట్ అఖండ 3 మూవీకి నాంది పలుకుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ పార్ట్ 3 కోసం దర్శకుడు, నటీనటులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అఖండ పార్ట్ 3 ఉంటుందా.. లేదా అనేది చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: