టాలీవుడ్ లో ఈ మద్య యంగ్ డైరెక్టర్లు తమ సత్తా చాటుకుంటున్నారు. ఇందులో ఎవడే సుబ్రమాణ్యం సినిమాతో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నాగ్ అశ్విన్. ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో ‘మహానటి’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో సమంత, విజయ్ దేవరకొండ ముఖ్యపాత్రల్లో నటించారు. తెలుగు అభిమాన నటి సావిత్రి జీవిత కథ అనగానే ఎన్నో రకాల అనుమానాలు, విమర్శలు వచ్చినా.. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అందరూ ఫిదా అయ్యారు.
మహానటి సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ నిజంగానే ప్రాణం పోసిందా అన్నంత అద్భుతంగా నటించింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నాని హీరోగా నటించగా అతని స్నేహితుడిగా విజయ్ దేవరకొండ నటించాడు. 2015లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే విజయ్ దేవరకొండలో ఉన్న ఎనర్జీ కనిపెట్టిన నాగ్ అశ్విన్ మరోసారి ‘మహానటి’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండకు వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లీస్ట్ లో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు వుండనుందనే విషయం రీసెంట్ గా బయటికి వచ్చింది. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకున్నారు.
అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి వెళుతోంది. ఆల్రెడీ కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు. నాగ్ అశ్విన్ తో విజయ్ దేవరకొండ చేయనున్నాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.