తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఉప ఎన్నిక సమయానికి బీజేపీతో సయోధ్య కుదిరితే సరే లేకుంటే బయట నుంచైనా ఆ పార్టీకి మద్దతివ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తాము పోటీ చేసి అనవసరంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ఎందుకని సీనియర్ నేతల వద్ద కూడా చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసిింది. వైసీపీని ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి అయినా ఓడించగలిగితే జగన్ పై విజయం సాధించినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని అమరావతి అంశాన్ని తిరుపతి ఉప ఎన్నికలో రిఫరెండంగా ప్రకటించేందుకు మాత్రం చంద్రబాబు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.