తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అధికార ప్రభుత్వాలకి కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది.. మోడీ సౌత్ పై ద్రుష్టి పెట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఇక్కడి నేతలకు చెప్పగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆ విధంగా ముందుకు సాగుతున్నారు.. రెండు రాష్ట్రాల్లో మంచి పోటీ బీజేపీ ఇవ్వనుందని తెలుస్తుంది.. ఇప్పటికే పంటికింద రాయిలా అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తలనొప్పిని తెస్తుండగా తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ ప్లేస్ కి ఎసరు పెట్టింది.