జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే విధంగా
వంశీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నారా లోకేశ్,
జూనియర్ ఎన్టీయార్ గురించి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న సమయంలో
లక్ష్మీపార్వతి తన ఇద్దరు మనవళ్ల గురించి ఒక
మీడియా ఇంటర్వూలో స్పందించారు. నారా లోకేశ్ ను చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మీద బలవంతంగా రుద్దుతున్నారని
లక్ష్మీపార్వతి అన్నారు. మీ మనవడు లోకేశ్ పై
ప్రేమ లేదా...? అనే ప్రశ్నకు వాళ్లకు ఉందా ప్రేమ..? అని
లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
60 సంవత్సరాల వయస్సు దాటిన తనపై భయంకరమైన నిందలు సృష్టించినవాడు మనవడు ఎలా అవుతాడు..? అని
లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గత 5సంవత్సరాలలో దారుణంగా పరిపాలన చేశాడని
లక్ష్మీపార్వతి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఒక్క పథకం అయినా సరిగ్గా అమలు చేసిందా...? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.