ఏ కొమ్మకు ఆ ఆకు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అన్న సంగతి తెలిసిందే.. కేంద్రంలో ఎ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి కొమ్ము కాసి తన పనులు చేయించుకుంటూ ఉంటారు బాబు.. అయితే గత ఎన్నికల సమయంలో బీజేపీ తో చంద్రబాబు కు మధ్య ఓ యుద్ధమే  జరిగిందని చెప్పొచ్చు.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బీజేపీ ని టార్గెట్ చేస్తూ ఉద్యమం కొనసాగిస్తే బీజేపీ పార్టీ మాత్రం చంద్రబాబు ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి తన వంతు కృషి చేసిందని అంటారు.. ఎన్నికల సమయంలో అన్నేళ్ళు మైత్రి తో ఉన్న చంద్రబాబు ను వదిలేసి, సొంత పార్టీ ని కూడా వదిలేసి జగన్ కి సపోర్ట్ చేయడం వెనుక ఇంత అర్థం ఉందా అని ప్రజలు అనుకున్నారు.


ఇక అధికారంలోకి వచ్చాక జగన్ కేంద్ర బీజేపీ తో మంచి సంభంధాలు కొనసాగిస్తున్నారు.. ఇప్పటివరకు ఒక్క భేదాపిప్రాయాలు రాలేదు..  ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ను సైతం వైసీపీ పార్టీ సపోర్ట్ చేసి మోడీ ఆదరాభిమానాలను చూరగొంది.. ఇక ఇక్కడే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గతంలో కాకుండా మోడీ పై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నాడు.. ద్రోహి అన్న అదే నోరుతో ఇప్పుడు దేవుడు అనే స్థాయికి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం టీడీపీ కి సైతం ఆశ్చర్యకరంగా ఉంది..


సాధారణంగా ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీ అధినాయకులపై ఈగ వాలినా ఊరుకోరు. రాజకీయ పరంగా వచ్చే ఎటువంటి విమర్శలనైనా వెనువెంటనే తిప్పకొట్టేస్తుంటారు. అయితే ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోందంటున్నారు విశ్లేషకులు. ప్రధాని నరేంద్రమోదీపై కనీసం ఈగ కూడా వాలనీయకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చూసుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ జాగ్రత్త ఎదో అప్పుడే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని కొంతమంది అభిప్రయడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: