ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈస్ట్ గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముఖ్యమంత్రి  జగన్‌ మోహన్ రెడ్డి కి పెద్ద  తలనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో వైసీపీ  నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అని బాగా  తిట్టుకున్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్-కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వెంటనే అధినేత ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి  ఇద్దర్ని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.

ఇంకా ఇలా చెయ్యొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇలాంటి  ఊహాగానాలు బాగా వినిపించాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద హాట్‌టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరు నేతలు అధినేత దెబ్బకు తమ మధ్య విభేదాల్లేవని చెప్పే ప్రయత్నం చేశారు.ఇక జగన్ ఇచ్చిన వార్నింగ్ కి ఆ ఇద్దరి నేతలు కొంచెం కుదుట పడ్డట్లు తెలుస్తుంది...

కాకినాడ నగరం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటికి ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వెళ్లారు. తన ఇంటికి వచ్చిన ఎంపీకి ద్వారంపూడి స్వయంగా కండువా కప్పి మరీ స్వాగతం పలికారు. ఇద్దరూ సమావేశమై చాలాసేపు మాట్లాడుకున్నారు. అలాగే మరో ఎంపీ వంగా గీత కూడా ఈ సమావేశానికి వెళ్లారట. పార్టీల్లో విభేదాలు సాధారణమే అని నేతలు అంటున్నారట.


గురుశిష్యులైన మీరిద్దరి మధ్యే పంచాయితీ వస్తే నేనెవరికి చెప్పను.. ఏం చేయను’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారని ద్వారంపూడి ప్రస్తావించారట. మొత్తానికి ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లే అని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ద్వారంపూడి.. బోస్ మనసు విప్పి మాట్లాడుకున్నారని.. అన్నీ సర్దుబాటయ్యాయని నేతలు అంటున్నారు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: