మన దేశంతో భౌగోళిక సరిహద్దులు గల పొరుగు దేశాల్లో
పాక్, చైనాలు ఎప్పటికప్పుడు వారి విస్తరణవాద కాంక్షలు, ఆలోచనలు, భావాలతో సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనాతో ఉమ్మడి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకానొక సందర్భంలో యుద్ధ మేఘాలు అలముకున్నప్పటికీ తరువాత ఆ పరిస్థితిలు నెమ్మదిగా సద్దుమణిగాయి. ఇప్పుడు ఇలాంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొంటున్న వేళ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వైమానిక దళం కోసం.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి
తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు
కేబినెట్ భద్రతా కమిటీ అంగీకారం తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 83 మార్క్-1ఏ
తేజస్ ఫైటర్లను కొనుగోలు చేయడం కోసం కేంద్రం ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. దేశీయ యుద్ధ వైమానిక రంగంలో ఇదే అతిపెద్ద ఒప్పందం కావడం విశేషం.
ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరాక.. 83 యుద్ధ విమానాల డెలివరీ ప్రక్రియ మూడేళ్ల తర్వాత ప్రారంభం కానుంది. ఐఏఎఫ్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన 40
తేజస్ మార్క్ యుద్ధ విమానాలకు మార్పులు చేస్తూ మరొక 43 విమానాలు కొత్తగా చేర్పులు చేయనున్నారు. గాల్లోనే ఇంధనం నింపుకోవడం, శత్రువుల రాడార్లు, మిస్సైళ్లను జామ్ చేసేలా అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్.. లాంగ్ రేంజ్ బీవీఆర్ మిస్సైళ్లు తదితరాలను జత చేయనున్నారు. భారత రక్షణ ఉత్పత్తిలో ఈ ఒప్పందం ఓ
గేమ్ ఛేంజర్ అని రక్షణ శాఖ
మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తేలికపాటి
తేజస్ యుద్ధ విమానాలు రాబోయే కాలంలో భారత వైమానిక రంగానికి వెన్నెముకగా నిలువనున్నాయి. నాసిక్, బెంగళూరు డివిజన్లలో సెకండ్ లైన్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ను హెచ్ఏల్ ఏర్పాటు చేసింది.