
ఇక నుంచి రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్ అవసరం లేదు. కరోనా కారణంగా ఇప్పటి వరకు రిజర్వేషన్ ఉంటేనే రైలులో ప్రయాణించే అవకాశం ఉండేది. ఇప్పుడు సడలింపులు ఇస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని 74రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. బుకింగ్ కౌంటర్లలో అన్ రిజర్వ్ డ్ టికెన్ తీసుకొని ప్రయాణించవచ్చని తెలిపింది.
మరోవైపు ఉన్నత సౌకర్యాలతో ప్రవేశపెట్టిన తేజస్ రైలు.. ఆలస్యంగా నడవడంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూలు చేసిన ఫీజును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. 1574మంది ప్రయాణీకులకు 250రూపాయల చొప్పున 3లక్షల 93వేల 500రూపాయలు చెల్లించింది ఐఆర్ సీటీసీ. ఈ నెల 21న లక్నో నుంచి బయల్దేరిన రైలు.. 2.5గంటలు ఆలస్యంగా ఢిల్లీ చేరింది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగా లేట్ అయిందని తెలిపినా ప్రయాణీకులు గొడవ చేయడంతో.. ఐఆర్ సీటీసీ కొంత మొత్తం ఇచ్చేసింది.