ప్రస్తుతం ఈ వాయుగుండం ఉద్రిక్తత పెరిగిందని పెనువేగంతో ముంచుకొస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాన్ గాలులు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకు వస్తున్నాయి అని తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం తమిళనాడు లోని నాగ పట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది అని సమాచారాన్ని అందించింది. ఇపుడు అది కాస్తా దిశను మార్చుకుని తమిళనాడు వైపు వస్తున్నట్లు పేర్కొంది. తీవ్రంగా మారిన ఈ తీవ్ర వాయు గుండం కారణంగా కోస్తాంధ్ర తీరం, తమిళనాడు వైపు బలమైన ఈదురు గాలులు వేసే అవకాశం ఉందని పేర్కొంది .
అదే విధంగా తమిళనాడు, దక్షిణకోస్తా, రాయలసీమ, ప్రాంతాల్లో వర్షాలు సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తుఫాను సూచన కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అదే విధంగా ఈ వాయుగుండం ఉద్రిక్తత మరింత పెరిగితే తుఫాను ప్రభావం పలు పరిసర ప్రాంతాల పై కూడా ఉంటుందని అధికారులు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు. మరి ఈ తుఫాన్ ముప్పు తప్పుతుందా లేదా రాబోయే కొన్ని గంటల్లో వర్షంగా మారుతుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి