ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయన తమ కూటమికే అధికారం దక్కుతుందని భావిస్తున్నారు.'రా కదిలి రా', 'శంఖారావం', 'జెండా' పేరుతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ ఇంకా అలాగే నారా లోకేశ్‌ భారీ ఎత్తున సభలని నిర్వహిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రజలను వారు కోరుతున్నారు.కాగా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి సంచలన లేఖ రాయడం జరిగింది. తనపై ఇప్పటి దాకా ఎన్ని కేసులు నమోదై ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ రానుందని.. ఈ నేపథ్యంలో తనపై ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదని.. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదు చేసిన కేసుల వివరాలను ఇవ్వాలని కోరారు.ఎన్నికల నామినేషన్‌ లో తనపై ఎన్ని కేసులు నమోదై ఉన్నాయో తాను వివరాలు పొందుపరచాల్సి ఉంటుందని.. అందుకని తనపై నమోదై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతున్నానని చంద్రబాబు నాయుడు డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.


ఇంకా డీజీపీకే కాకుండా అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖలు రాశారు.2019 వ సంవత్సరం తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై వైసీపీ ప్రభుత్వం పలు అక్రమ కేసులు పెట్టిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 వ సంవత్సరం నుంచి నమోదైన కేసుల వివరాలు తెలపాలని కోరుతున్నానన్నారు. తాను ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి సమాచారం పొందే ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. అందుకే మీ ఆఫీస్ లా ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా అని డీజీపీ, ఎస్పీలు, ఏసీబీ, సీఐడీలకు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఎన్నికల నోటిఫికేషన్‌ అనేది ఖచ్చితంగా ఏ క్షణాన అయినా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ వివరాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: