చిలకలూరిపేట సమీపంలో బొప్పాడిలో నిన్నటి రోజున జరిగిన భారీ బహిరంగ సభ చూసి అందరికీ ఒక సందేహం వస్తోంది. ముఖ్యంగా జగన్ పైన నేరుగా మోడీ విమర్శలు చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఏదో అనాలని అన్నారే కానీ జగన్ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఒక్క కామెంట్ తోనే సరి పెట్టుకున్నారు. కానీ టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు మోడీ నుంచి చాలానే ఎక్స్పెక్ట్ చేశామని కానీ అలాంటిది ఎక్కడా ఏమీ కనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ అవినీతి గురించి ప్రస్తావిస్తారని అందరూ భావించగా... కానీ అలాంటివేమి చేయలేదు.


 టిడిపి నేతలు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మోదీ కామెంట్స్ ఎక్కడ వినిపించలేదు.. కేవలం మోడీ ప్రసంగమంతా ఎన్డీఏను గెలిపించాలని 400 సీట్లు రావాలని కోరికతో తప్పించి జగన్ ప్రభుత్వాన్ని దించాలని పిలుపుని ఎక్కడా కూడా అటు టిడిపి నేతలకు ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. వాస్తవానికి మోడీ ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ పార్టీల పైన విమర్శలు చేస్తూ ఉంటారు.. ఇటీవల తెలంగాణలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన అవినీతి విమర్శలు కూడా చేయడం జరిగింది. మరి అక్కడ నేతలు కూడా విమర్శించారు కానీ ఆంధ్రాలో వచ్చేసరికి మొత్తం మార్చేశారు మోది..


ఏపీ సీఎంను ప్రత్యక్షంగా విమర్శించకుండా చిక్కి చిక్కినట్లు గా అనేసి వెళ్లిపోయారు..మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ జగన్ వేర్వేరు అయినప్పటికీ ఒకే కుటుంబ సభ్యులు అన్నట్లుగా వ్యవహరించారు. అంతే తప్ప జగన్ పైన ప్రత్యేకంగా ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. జగన్ని ఓడించాలని చెప్పకపోవడంతో అందరూ నిరుత్సాహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. టిడిపి జనసేన అభ్యర్థులను గెలిపించాలంటూ నేరుగా కోరలేదు.. ఆ సమయంలోనే ఎన్డీఏ ఎంపీ అభ్యర్థులను మాత్రం గెలిపించాలని తెలియజేశారు.. గత ఎన్నికల ప్రచారంలో ఏపీకే వచ్చినప్పుడు కుటుంబ పార్టీని పోలవరాన్ని ఏటీఎం గా చంద్రబాబు వాడుకొని చాలా విమర్శించారు కానీ ఈసారి మాత్రం పోలవరం ప్రస్తావన లేదు కేవలం అభివృద్ధి లేదంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి మోడీ వంటి వారు జగన్ మీద విమర్శించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: