టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అలా చేసిన వెంటనే మొదటి సంతకం దేనిపైన పెడతాను అంటూ కూడా తెలియజేశారు. మొదట మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చేస్తానని యువతకు భరోసా ఇస్తానని కూడా తెలియజేస్తున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం చేసి 60 రోజులలోనే డీఎస్సీ విడుదల చేస్తానంటూ తెలియజేశారు చంద్రబాబు.. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తానంటూ వెల్లడించారు.


యువత కూడా ఎన్నికల సంఘాల వద్దకు వెళ్లి కలవండి ఈ డీఎస్సీ వద్దని చెప్పండి ఎన్నికలయ్యాక మెగా డీఎస్సీ జరపాలని కోరండి అంటూ చంద్రబాబు మళ్లీ నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారు.. గతంలో టిడిపి ప్రభుత్వం 1.50 లక్షల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామంటూ తెలియజేశారు. ఇప్పటి వరకు అదే రికార్డు అని మళ్లీ అలాంటి రికార్డ్ సృష్టిస్తామంటూ తాము కూడా మెగా డీఎస్సీ అదే స్థాయిలో జరుపుతామంటూ చంద్రబాబు ప్రకటించారు.


వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒకసారి కూడా ఎలాంటి డీఎస్సీ నిర్వహించలేదని మీ జీవితాలను అంధకారంలో చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే యువతకు పిలుపునిస్తున్నారు.. కేవలం యువతను మద్యానికి గంజాయికి డ్రగ్స్ కు బానిసలు అయ్యేలా చేస్తున్నారంటూ ఎద్దేవ చేశారు చంద్రబాబు. తమ పార్టీని గెలిపించడం కోసం యువత అంతా కూడా ఏకం కావాలి అని యువత తరపున పోరాడేందుకు తాము ఉన్నామంటూ చంద్రబాబు తెలుపుతున్నారు.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ చేస్తానంటూ కూడా యువతకు హామీ ఇస్తున్నప్పటికీ.. చంద్రబాబు మాటలు మాత్రం ఎవరూ నమ్మడం లేదు ఇటీవల కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ విషయాలను తెలియజేస్తున్నారు.. ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినటువంటి హామీలను కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: