ప్రస్తుత బీజేపీ ఎంపీ గత బిఆర్ఎస్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కాలేశ్వరం అక్రమాల పై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు .. ఇప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఎంతో కీలకం .. ప్రధానంగా అంతా కేసిఆర్ చేశారని ఇంజనీర్లు , కాంట్రాక్టర్లు వంగమూలం ఇచ్చారని ప్రచారం గట్టిగా జరుగుతున్న సమయంలో .. ఈటల రాజేందర్ నుంచి వచ్చే సమాచారం కీలకం కానుంది .. ఆయన కూడా కేసీఆర్ ఏ అంత చేశారని చెబితే .. బీఆర్ఎస్ అధిపతికి గడ్డు కాలం ఎదురు కావచ్చు అని అంటున్నారు. కాలేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈట‌ల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు .. ఆయనే నిధులు విడుదలకు సంతకాలు కూడా చేశారు ..


నిజానికి కేసీఆర్ సీఎంగా ఉంటే మంత్రులకు చెప్పినచోట సంతకాలు చేయడం తప్ప మరో స్వేచ్ఛ ఉండేది కాదని అంటారు ..  కానీ ఎక్కడ ఏం జరుగుతుందో విషయాలు తెలుస్తాయి .. ఈటలకు ఇంకా బాగా తెలుస్తాయి. ఈ విషయాలు ఆయన కాలేశ్వరం కమిషన్ ముందు చెబుతారా లేదా అనేది ఎప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఒకప్పుడు ఈట‌ల రాజేందర్ , కెసిఆర్ ఎంతో సన్నిహితులు కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి గెంటయ్యడానికి కేసీఆర్ ఎన్నో కుట్రలు చేశాడు .. అలాగే తప్పుడు ప్రచారాలు చేయించి .. ఎస్సీ భూముల్ని కబ్జా చేశారని నిందలు కూడా వేశారు .. ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు ..


ఇక చివరకు పార్టీ నుంచి బయటకు తోసేసారు. అతి కష్టం మీద ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకుంటూ వస్తున్నారు .. అయితే ఆ కోపం ఇంకా మనసులోనే ఉంటే మాత్రం కెసిఆర్ గురించి కీలక విషయాలు చెబుతారని .  లేకపోతే తాను కూడా ఇరుక్కుంటానని భావిస్తే మాత్రం అంత నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు .. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగ ప్రచారం జరగకపోతే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఈటలకు గట్టి సమస్యలు రావచ్చని అంటున్నారు .. ఇక మరి ఈటల కమిషన్ ముందు కెసిఆర్ పై ఎలాంటి ఆరోపణలు చేస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: