తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రాను రాను మరింత రాజకీయంగా దుమారం రేపుతుంది .. ప్రధానంగా తన ఫోన్లు ట్యాప్ అయ‌నన మాట నిజమేనని ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు .. అయితే అంతకు ముందు తాను దీని గురించి నమ్మలేదని కానీ వైవి సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి మరి ఈ విషయం చెప్పారని .. అలాగే తన ఆడియో క్లిప్ వినిపించారని కూడా అన్నారు .. ఇక అప్పుడు నమ్మక తప్పలేదని కూడా ఆమె అన్నారు .. అంతేగా ఉన్న తన ఫోన్లో మాత్రమే కాకుండా తన భర్త , సన్నిహితుల ఫోన్ అన్నింటిని కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు ..

అలాగే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా చేశారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు .. అయితే తనతో రాజకీయంగా కలిసి వచ్చే వాళ్ల గురించి , అలాగే ఆర్థికంగా సాయం చేసే వారి గురించి ఈ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని వారిని భయపెట్టారని .. అలాగే తనను రాజకీయంగా బలహీన పరిచారని ఆమె ఆరోపించారు .. అలాగే ట్యాపింగ్ బాధితురాలి గా తాను ఎక్కడికి వచ్చి అయినా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికైనా సిద్ధమని ప్రకటించారు ..

ఇక అప్పట్లో జగన్ రెడ్డికి , కెసిఆర్ కు ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్నారు .. అలాగే వారి మధ్య ఉన్న సంబంధం తో రక్తసంబంధం కూడా చిన్నదైపోయిందని షర్మిల సెటైర్ కూడా వేశారు .. అయితే షర్మిల ఆరోపణలు ఇప్పుడు ఆషామాషీగా లేవు. .. నేరుగా ఇందులో వై వి సుబ్బారెడ్డి పేరు చెప్పి ఆయనే తనకు ట్యాప్  జరుగుతున్నాయని చెప్పి ఆడియో క్లిప్ కూడా వినిపించారని ఆస‌ల విషయాన్ని బయటపెట్టారు .. ఇక ఇప్పుడు సుబ్బారెడ్డి దాన్ని ఖండించాల్సి ఉంది .. మరి ఆయన ఖండిస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది వేచి చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: