
వైట్ బాడీ బోరింగ్ విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నామని .. అలాగే అదనపూ జాగ్రత్తల కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా చెప్పుకొస్తుంది. అలాగే ఈ తగ్గింపు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణ కూడా చెబుతుంది .. ఈ క్రమంలో ప్రయాణికులు ఎలాంటి ఖర్చు లేకుండా వారి ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకునే లేదా డబ్బులు వాపస్ తీసుకొనే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పుకొస్తుంది .. ఇక ఈ కొత్త షెడ్యూల్ జూన్ 20 2025 నుంచి అమల్లోకి రాబోతుందని తెలుస్తుంది . ముఖ్యంగా కార్యచరణ స్థిరత్వాన్ని పునరుద్దించడానికి ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది సహయపడుతుందని ..
అలాగే ప్రయాణికులు పౌర విమానయ మంత్రిత్వ శాఖ , భారతదేశ మద్దతుతో తాము ఈ విషాద సంఘటన నుంచి మరింత బలంగా బయటపడతామని . అలాగే ప్రయాణికులకు తమ సేవలో విశ్వాసాన్ని తిరిగి తెప్పించగలుగుతామని చెప్పుకొస్తుంది . అయితే ఇటీవల ఎయిరిండియా బోయింగ్ 787 -8/9 విమానాల్లో మెరుగైన భద్రత తనిఖీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తప్పనిసరి చేసిన విషయం తెలిసింది .. ఈ క్రమంలో మొత్తం 33 విమానాలలోను ఇప్పటికే 26 విమానాలు తనిఖీలు పూర్తయ్యాయని ఎయిరిండియా చెప్పుకొచ్చింది మిగిలినవి కూడా త్వరలో పూర్తవుతాయని అంటుంది.