
అలాగే నీటి ఒప్పందాలపై చర్చించడానికి నిజాలు బయటపెట్టడానికి అసెంబ్లీ కన్నా సరైన ప్లేస్ మరొకటి ఉండదు .. అలాగే మన ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని అన్నిటికన్నా ఎంతో కీలకమైనది .. చట్టసభలు కాకుండా బయట ఎక్కడ జరిగినా దానికి ఎలాంటి విలువ ఉండదు .. ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు ప్రధానంగా కేటీఆర్ కు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలియనిది కాదు .. అయినా కూడా కేటీఆర్ ఎందుకు ప్రెస్ క్లబ్ లో చర్చకు సవాల్ చేశారు కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి కి ఒక క్లారిటీ ఉంది .. అసెంబ్లీకి రావాలని తమ డిమాండ్ కాబట్టి .. దానికి పంగనామం పెట్టడానికి ఇలా వారు ప్లాన్ చేశారని అంటున్నారు .
అలాగే జల ఒప్పందంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తీరును రేవంత్ రెడ్డి బట్టబయలు పెడుతున్నారు .. ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో ఆయన చేసుకున్న 299 టీఎంసీల ఒప్పందం గురించి . అలాగే గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం పై కేసీఆర్ గతంలో చేసిన ప్రకటన పైన కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లేలా రేవంత్ కుండ బద్దలు కొట్టే విధంగా చెబుతున్నారు . ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతున్న గులాబీ పార్టీ .. ముఖ్యమంత్రి గా ఉంటూ రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని గగోలు పెడుతుంది .. నిజాలు ఏమిటో మాత్రం వారు బయట పెట్టలేకపోతున్నారు . ఇలా మొత్తంగా జల వివాదంలో అన్ని విధాలుగా ముఖ్యమంత్రిగా రేవంత్ అడ్వాంటేజ్ సాధిస్తున్నట్లుగా కనిపిస్తున్న విషయాలు చెబుతున్నాయి .