ఉత్తరాది రాష్ట్రాల పై దశాబ్దాలు గా అధిక దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) , ఇప్పుడు దక్షిణాది పై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది . ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ నేతలకు బీజేపీ దక్షిణ రాష్ట్రాల లో కీలక పదవులు ఇవ్వడం వెనుక వ్యూహాత్మక లెక్కలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . బీజేపీ ఇప్పటివరకు ఉత్తరాది ఓటర్లను ఆకర్షించేందుకు అధికంగా శ్రమించింది . కానీ తాజా పరిస్థితుల్లో, ఉత్తరాదిలో కాంగ్రెస్ బలోపేతం అవుతుండటంతో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి చిన్నపాటి ప్రాంతీయ పార్టీలు బలపడటం తో బీజేపీకి అక్కడ పోటీ తీవ్రత పెరిగింది .
 

ఇదే సమయంలో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కి ప్రత్యక్షంగా గట్టి వ్యతిరేకత కనిపించడం లేదు . తెలుగు రాష్ట్రాల్లో టిడిపి , జనసేన లాంటి కూటమి పార్టీల తో మైత్రి వాతావరణం ఏర్పడింది . తమిళనాడు , కర్ణాటక లోనూ వ్యూహాత్మకం గా బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు . ప్రస్తుతం దక్షిణాదికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న ప్రాజెక్టులు , నిధుల కేటాయింపులు బీజేపీ కి రాజ‌కీయంగా మేలు చేసే అవకాశంగా మారుతున్నాయి . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , తమిళనాడు , కర్ణాటక వంటి రాష్ట్రాలలో అభివృద్ధికి పెరుగుతున్న మద్దతు – ప్రజల్లో నచ్చుబాటు పెరగడానికే సూచికగా చూడవచ్చు .

 

ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - జనసేన మద్దతుతో కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన బీజేపీ , ఇదే ఫార్ములాను 2029 వరకు కొనసాగించేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే "ఆపరేషన్ లోటస్" కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ దక్షిణాది పై చూపిస్తున్న తాజా ఆసక్తి - ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సూచిస్తుంది . ఇది కేవలం పదవుల రాజకీయంగా కాకుండా , బలమైన రాజ‌కీయ పునాది ఏర్పాటుకు ఉద్దేశించిన యత్నంగా భావించాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: