
జన సైనికులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జనసేనపై కుట్ర జరిగిందని వినుతపై కుట్ర జరిగిందని చెబుతున్నారు. తమిళనాడు టీవీ ఛానెల్లలో ప్రసారమైన కథనాలను సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. వినుతకు అక్రమ సంబంధం అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని గతంలో వినుతకు టికెట్ కన్ఫర్మ్ అయిందని అయితే గతంలో ఆమె గురించి కొంతమేర చెడు ప్రచారం జరగడంతో ఆమెకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
అయితే ఆ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి తన డ్రైవర్ అని విచారణలో వెలుగులోకి వచ్చిందని సమాచారం అందుతోంది. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి అతనికి డబ్బులు ఇవ్వడం వల్లే డ్రైవర్ ఈ విధంగా చేశాడని అందుకే వినుత దంపతులు హత్య చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి ఈ అంశం గురించి ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఈ వివాదం వినుత కెరీర్ పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ వ్యక్తిగత రహస్యాలు బట్టబయలు అవుతున్నాయనే కారణంతో అతనిని కడతేర్చారని తెలుస్తోంది. శ్రీనివాసులు అలియాస్ రాయుడు వయస్సు కేవలం 22 సంవత్సరాలు కాగా ఈ ఘటనలో వినుతకు శిక్ష పడుతుందా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.