కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా - యెమెన్‌లోని కోర్టు ఆమెను 2018లో ఓ యెమెన్ పౌరుడిని హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఆమెకు త్వరలోనే మరణశిక్ష అమలు అయ్యే అవకాశం ఉండగా , యెమెన్ అధ్యక్షుడు రషాద్ అల్ - అలిమీ ఇటీవలే ఈ తీర్పును ఆమోదించారు . నిమిషా ప్రియ ప్రాణాలను కాపాడే చివరి మార్గం – బ్లడ్ మనీ (దియ్యా) .. యెమెన్‌లో అమలవుతున్న ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం, హత్య కేసుల్లో బాధిత కుటుంబం క్షమించాలనుకుంటే, "దియ్యా" లేదా "బ్లడ్ మనీ" రూపంలో పరిహారం తీసుకుని నేరస్తుడిని క్షమించవచ్చు. ప్రభుత్వానికి ఇది ప్రైవేట్ వ్యవహారం. ఎంత మొత్తాన్ని తీసుకోవాలో బాధిత కుటుంబమే నిర్ణయిస్తుంది.

తల్లిదండ్రుల వేదన .. రూ.8.6 కోట్ల వరకు సిద్ధం ... నిమిషా తల్లి ప్రేమకుమారి, గత సంవత్సరం యెమెన్ వెళ్లి బాధితుడు తలాల్ అబ్దో మహ్దీ కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. రూ.8.6 కోట్ల పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ బాధిత కుటుంబం అంగీకారం తెలపలేదు. మత పెద్దలు రంగంలోకి .. ఇప్పుడు భారత ముస్లింల మత గురువు ఏపీ అబూబకర్ ముస్లియార్ సహా యెమెన్ మత పెద్దలు, స్థానిక అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు చర్చలు జరుపుతున్నారు. “ఇప్పటికి ఇది ఒక్కటే మార్గం” అని నిమిషా న్యాయవాది సుభాష్ చంద్రన్ వెల్లడించారు.

 భారత ప్రభుత్వ పరిమితులు ..  భారత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత-యెమెన్ మధ్య ప్రస్తుతం బలమైన దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సర్వోన్నత స్థాయిలో ఉపయోగపడటం లేదు. బ్లడ్ మనీని భారత ప్రభుత్వం అధికారికంగా చెలామణి చేయలేని పరిస్థితి ఉండటంతో కేంద్రం కొంత దూరంగా ఉంది. ఊరటిచ్చిన తాజా వార్త .. అయితే నిమిషా ప్రియకు ఊరటనిచ్చే వార్త విన్నివ్వడం యెమెన్ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వర్గాలు తెలియజేశాయి. ఆమెకు అమలవాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నిర్ణయం భారత విదేశాంగ శాఖకు సమాచారం చేరినట్లు తెలుస్తోంది. ఇక ప్రశ్న ఒకటే: బ్లడ్ మనీ అంగీకారంతో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దవుతుందా ? లేక ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనా ? దేశం మొత్తం ఆశగా ఎదురుచూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: