ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అత్యంత ఘోరంగా పరాజయం చవిచూడగా.. కూటమి ప్రభుత్వం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడం, మరొకవైపు చంద్రబాబు నాయుడు తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం అన్నీ ఒక కలలా జరిగిపోయాయని, ఇప్పటికీ కొంతమంది పార్టీ శ్రేణులు చెబుతూ ఉంటారు. ఇకపోతే అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉండగా.. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

వాస్తవికత విషయానికి వస్తే.. సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉంటే సప్లై తక్కువగా ఉంటుంది. ఇక డిమాండ్ కి,  ధరకి లింక్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుత పరిస్థితి డిమాండ్ ఉంది కానీ చేతిలో డబ్బు ఉండడం లేదు. సప్లై ఉంది , దానిని కొనుగోలు చేసే డిమాండ్ ఉంది. కానీ డబ్బు లేదు. ఫలితంగా కొనుగోలు పడిపోయింది.  ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. అందులో కాగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది అంటూ ఒక వార్తను వెల్లడించింది.

రెవెన్యూ రాబడులు గత ఏడాది 46, 112 కోట్లు ఉంటే.. ఈ ఏడాది 36,239 కోట్లు ఉంది. ఇందులో విశేషమేమిటంటే అంతకుముందు జగన్ సమయంలో రెవెన్యూ దెబ్బ తినలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు టైమ్ లోనే మళ్లీ రెవెన్యూ దిగజారి పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  అమ్మకపు పన్ను ఆదాయం 4733 నుంచి 4364 కోట్లకు పడిపోయింది. పన్నేతర ఆదాయం 1380 నుంచి 1269 కోట్లకు పడిపోయింది కేంద్ర గ్రాండ్లు 15, 699 కోట్ల నుండి 1465 కోట్లకు పడిపోయింది. సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు 48, 976 కోట్ల నుండి 41,491 కోట్లకు పడిపోయింది. ఇకపోతే రెవెన్యూ పడిపోయినప్పటికీ సీఎం చంద్రబాబు సమయంలో ఈ రేంజ్ లో ఖర్చు పెట్టారనేది మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.. మొత్తానికైతే ఈ రేంజ్ లో రెవెన్యూ పడిపోవడంతో పథకాల సంగతి ఏంటి అని ప్రజలు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: