శ్రావణ మాసాన్ని చాలా చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు మహిళలు. మరీ ముఖ్యంగా ఈ మాసంలోనే ఎక్కువగా వ్రతాలు , నోములు, పూజలు చేసుకుంటూ ఉంటారు . అయితే అధిక శాతం మంది మహిళలు చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం . వరాల తల్లి వరలక్ష్మి దేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ తమకి తోచిన రీతిలో ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ ఉంటారు . ఈ ఏడాది ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం జరుపుకొనున్నారు. అయితే ఈరోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిని స్పెషల్గా పూజిస్తారు. ప్రత్యేకంగా అలంకరించి ధూప దీపాలతో రకరకాల పిండి వంటలతో నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కానీ రెగ్యులర్ గా చేసే పూజలతో పాటు మరికొన్ని పరిహారాలు పాటిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అంటూ పెద్దలు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!

ఉప్పు దీపం :

శుక్రవారం ఉప్పు దీపం పెట్టడం ధన ఆకర్షణకు విశేషమైనదిగా భావించి ఆచరిస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు వచ్చే శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందట . ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఆ ఇంటిపై చూపిస్తుందట . ముఖ్యంగా దీపావళి పండుగ రోజు అదేవిధంగా వరలక్ష్మీ వ్రతం రోజు మహిళలు ఈ ఉప్పు దీపాన్ని ఇక్కడ అస్సలు మర్చిపోకుండా పెడుతూ ఉంటారు . ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తులను ఆకర్షించే స్వభావం ఉండడం వల్లే ఉప్పుదీపం పెట్టడం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటున్నారు పండితులు.  చాలామంది మహిళలు ఇప్పటికీ ఈ ఉప్పు దీపం సెంటిమెంట్ ఆచరిస్తూనే ఉంటారు . దీనివల్ల ఇంట్లో ధనాకర్షణ శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అని పండితులు చెప్తున్నారు.

తులసి మొక్కకు పూజ చేయడం:

సాధారణంగా ప్రతి శుక్రవారం మహిళలు తులసి మొక్కకు దీపారాధన చేస్తూ ఉంటారు . అయితే వరలక్ష్మీ వ్రతం రోజు వచ్చే శుక్రవారం నాడు తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు అంటున్నారు పండితులు.  తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందుకే ఇప్పటికి చాలామంది ఇళ్లలో తులసి మొక్కకు పూజ చేస్తారు.  తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అంశంగా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదిగా జనాలు భావిస్తూ ఉంటారు . వరలక్ష్మీ వ్రతం రోజున తులసి చెట్టుకు పూజ చేస్తే  లక్ష్మి కటాక్షంతో పాటు  ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అని ప్రగాఢ విశ్వాసం.

గోమాతకు పూజ చేయడం:

గోమాతలో సర్వదేవతలు ఉంటారు అనేది అందరికీ తెలుసు . చాలామంది గోమాతలను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు . వరలక్ష్మీ వ్రతం రోజున ఆవుకు ఆహారం పెట్టడం. సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి అంటున్నారు పండితులు. హిందూ ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు.  సాక్షాత్తు దేవతా స్వరూపంగా సకల దేవతలను నిలయంగా భావిస్తూ ఉంటారు . అలాంటి గోమాతకు వరలక్ష్మీ వ్రతం రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు అదేవిధంగా ఎప్పుడు సంతోషంగా అష్ట అశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం . ఆవుకు సేవ చేయడం మతపరమైన ఆలోచన మాత్రమే కాదు పర్యావరణానికి సమస్త మానవాళికి ఎంతో మేలు చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: