
ఈరోజు తాజ్ దుబాయ్లో రెండు ఫ్రాంచైజీలను సొంతం చేసుకోవడానికి మొత్తం 10 పార్టీలు బిడ్లతో రంగంలోకి దిగాయి. ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ మరియు అదానీ గ్రూప్ ఇతరులు ఒక జట్టును కొనుగోలు చేయడానికి బిడ్లు వేశారు. బిడ్డర్లు తమ బృందాన్ని స్థాపించడానికి అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గౌహతి మరియు ఇండోర్ అనే ఆరు కేంద్రాల నుండి ఎంచుకోవచ్చు.
అయితే ఇందులో అత్యధికంగా బీడ్ చేసి ఆర్పీఎస్జీ గ్రూప్, సీవీసీ క్యాపిటల్ రెండు జట్లను సొంతం చేసుకొని అహ్మదాబాద్, లక్నో ను ఎంచుకున్నాయి. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 లో మొత్తం 10 జట్లు రంగంలోకి దిగుతాయి. కానీ దాని కంటే ముందు ఈ రెండు కొత్త జట్లు ఏ పేరును ప్రకటిస్తాయి అనేది చూడాలి. అలాగే వచ్చే ఐపీఎల్ కోసం జరగనున్న వేలంలో ఏ ఆటగాళ్లను తమ సొంతం చేసుకుంటాయి.. అలాగే తమ జట్లకు ఎవరిని కెప్టెన్స్ ను చేస్తాయి అనేది చూడాలి.