
ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్ గా కొనసాగుతున్న న్యూజిలాండ్ జట్టు ఇక బంగ్లాదేశ్ పై ఎంతో అలవోకగా విజయం సాధించడం చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ బంగ్లా టీం ఘన విజయాన్ని అందుకని చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇలా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరిలో బంగ్లా జట్టు విజయం సాధించడంతో.. జట్టు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అయితే ఇలా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లకి ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. జట్టులోని ప్లేయర్స్ అందరికి కూడా బోనస్ ఇవ్వబోతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ కోర్టు ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని బంగ్లా బోర్డు ప్రతినిధి జలాల్ యునస్ తెలిపారు. సొంత గడ్డపై కివిస్ పై తొలి విజయం సాధించడం సంతోషంగా ఉంది. తమ జట్టు డాకాకు చేరుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వారితో డిన్నర్ చేస్తారని.. ఆ తర్వాత బోనస్ కూడా ప్రకటిస్తారు అంటూ జలాల్ యునస్ చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది.