
ఇక ఐసిసి ర్యాంకింగ్స్ ద్వారా ప్రోత్సాహాన్ని అందించడమే కాదు.. ఇక ఒక నెల మొత్తంలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను కూడా ఇవ్వడం చేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. గత కొంతకాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ కి సంబంధించిన నామినేషన్స్ ప్రకటించింది అంటే చాలు అందులో ఏ ఆటగాడు అవార్డును అందుకుంటారు అన్న చర్చ అటు వరల్డ్ క్రికెట్లో మొదలవుతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల వివరాలను సేకరించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ జాబితాలో భారత జట్టు నుంచి ఒకే ఒక ప్లేయర్ మాత్రమే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ప్లేయర్లు ట్రావెస్ హెడ్, మాక్స్వెల్ తో పాటు టీమిండియా ఫేసర్ మహ్మద్ షమీ ఇందులో చోటు దక్కించుకున్నాడు. నవంబర్లో హెడ్ 220 పరుగులు, మాక్స్వెల్ 205 పరుగులు చేయగా.. షమీ ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఎకానమీ 5.68 గా ఉంది. యావరేజ్ 12.06 గా ఉంది అని చెప్పాలి.