వరల్డ్ క్రికెట్లో ఇండియా పాకిస్తాన్, మ్యాచ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో ఉన్న ఎన్నో దేశాలు ఎప్పుడూ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ ఉంటాయి. అయితే అటు ఇండియా, పాకిస్తాన్ మధ్య మాత్రం ఇలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు అస్సలు జరగవు. ఎందుకంటే పాకిస్తాన్ తో మ్యాచ్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది అని చెప్పాలి. దీంతో ఇక అన్ని టీమ్స్ లాగా భారత్ పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్లలో తలబడవు. కేవలం ఆసియా కప్ వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలలో మాత్రమే తలబడుతూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఈ రెండు దేశాల మధ్య కేవలం ఆటలో మాత్రమే కాదు సరిహద్దుల మధ్య కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన కూడా హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక ఈ ఏడాది ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీల ద్వారా ఒకటికి రెండుసార్లు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం అందరికీ దక్కింది. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుండగా.. ఈ టోర్నీ లోను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ కోసం అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2024 t20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఏ రోజు జరగబోతుంది అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగానే ఉన్నారు. కాగా వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ జట్టు ఒకే గ్రూపులో ఉండనున్నట్లు క్రికెట్ వర్గాల నుంచి సమాచారం అయితే న్యూయార్క్ లో జూన్ 8 లేదా 9వ తేదీన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోతుందట. ఇండియా ఆడే మ్యాచ్లను దాదాపుగా యూఎస్ లోనే పెట్టాలని ఇండియా ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు సమయం వీలుగా ఉండాలి అనే ఆలోచనలో అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: