దాదాపు  17 ఏళ్ళ ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఎన్నోసార్లు టైటిల్ గెలిచేందుకు వీరోచిత  పోరాటం చేసినప్పటికీ.. ఎప్పుడూ నిరాశ పరుస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డూప్లెసిస్ కెప్టెన్సీలో ప్రదర్శన విషయంలో పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ.. టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు. ఇలా 17 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో సాధించలేనిది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం రెండో సీజన్లోనే బెంగళూరు టీం సాధించింది.


 ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఫైనల్లో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వీరోచిత పోరాటంతో టైటిల్ కలను సహకారం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలిచిన విషయం గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి జట్టు విజయాలలో  కీలక పాత్ర వహించిన శ్రేయంక పాటిల్  గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా మాత్రమే కాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకుంది శ్రేయాంక పాటిల్. అయితే ఈ ప్లేయర్ కు సంబంధించిన ఒక ఓల్డ్ ఫోటో వైరల్ గా మారిపోయింది. 2017లో రన్ మిషన్ విరాట్ కోహ్లీతో ఒక అభిమాని లాగా సెల్ఫీ దిగింది శ్రేయంక పాటిల్. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. కాగా ట్రోఫీతో శ్రేయంక దిగిన ఫోటోని ఎంతో మంది నెటిజన్స్ పాత ఫోటోకి జత చేస్తూ ఏడేళ్లలో ఎంత మార్పు. గ్రౌండ్లో అభిమానిగా ఒక సెల్ఫీ అడిగే స్థాయి నుంచి ఏకంగా ట్రోఫీని ముద్దాడే స్థాయికి చేరుకుంది శ్రేయంక పాటిల్ అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: