
తాజాగా.. జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో కమెడియన్ ప్రసాద్ కనిపించారు. ఈ సందర్భంగా అక్కడ ఎమోషనల్ గా మాట్లాడుతూ తనకి పునర్జన్మ ఇచ్చినటువంటి రోజా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు ప్రసాద్. యాంకర్ రవి ఈ షోలో ఇంతకు మీరు ఇక్కడికి వచ్చింది ఎవరికోసం ప్రసాద్ అంటూ చెప్పగా ఒక రోజా పువ్వు కలిగిన ఫోటో ని చూపిస్తూ ఉన్నారు ప్రసాద్.
ఈరోజు తాను ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను తన భార్య పిల్లలతో ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే మేడం మీరు పెట్టినటువంటి బిక్ష అంటూ రోజా అని పొగడ్తలతో మూన్ చేశారు ప్రసాద్.. నిజం చెబుతున్నాను మేడం అంటూ రోజా కాలు కూడా పట్టుకున్నారు ప్రసాద్. అంతేకాకుండా తనకు తన తల్లి ప్రాణం పోస్తే.. తన భార్య తనకు పునర్జన్మ ఇస్తే.. రోజా అని చూపిస్తూ అమ్మ నాకు మా అమ్మ కన్నా ఎక్కువ అంటూ చూపించారు. ప్రసాద్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్లుగా ఈ ప్రోమోలో కనిపించడం జరిగింది. మరి రోజా ఎలాంటి సహాయం చేసింది అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..