ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్‌ నాలుక కోస్తానని హెచ్చరించారు. సీఎం జగన్‌ను నారా లోకేశ్‌ ఏమైనా అంటే నాలుక కోస్తామని మేరుగు నాగార్జున వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కంటే జగన్‌ పాలనలోనే రాష్ట్రంలో ఎస్సీలు సంతోషంగా ఉన్నారన్న మేరుగు నాగార్జున.. జగన్‌ ఎస్సీ వ్యతిరేకి అంటూ తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన మండిపడ్డారు.


సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఏమన్నారంటే.. జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్‌కు లేదన్నారు. అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని.. ఎక్కడైనా ఎస్సీలపై దాడులు జరిగితే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేశ్‌ పదేపదే విమర్శిస్తున్నారని.. కానీ ఆయన దేశానికి ఆణిముత్యాల్లాంటి నాయకులను అందించారని మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: