ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోని పెద్ద తిప్ప సముద్రం మండలం కర్ణాటక సరిహద్దులో రోడ్డు ప్రమాదం జరిగింది. బోరు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. 

 


 ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బోరు బావి లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన వారు తమిళనాడుకు చెందిన వారుగా స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను బెంగళూరుకు తరలించారు. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం ఏలూరు మండలం పాల సముద్రం వద్ద బోర్ వేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: