విద్యుత్  కొనుగోళ్లలో మంచి చెప్తే వ్యక్తిగత దాడులకు వైసీపీ నేతలు దిగారని, అన్నింటిలోనూ అవినీతికి పాల్పడ్డారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశంలో లాక్ డౌన్ పెట్టాక ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పారని ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

 

 వాటిని సద్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టిందని ఆయన మండిపడ్డారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుగొనేందుకు ముందుకొచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రయోగాలకు ఉపయోగపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆరోగ్యం ఇంకా కుదటపడని టీడీపీ నేత అచ్చెన్నాయుడిని వీల్ ఛైర్‌లో కూర్చోపెట్టి అంబులెన్స్‌లో తరలించటం దుర్మార్గమని ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: