ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో భాగంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పలు పోస్టులను అప్పగించారు. ఎవరెవరికి ఏ పోస్టులను అప్పగించారనే వివరాల్లోకి వెళ్తే... స్వప్నిల్ దినకరన్ ను కాకినాడ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేశారు. రాజబాబును చిత్తూరు జేసీగా ట్రాన్స్ఫర్ చేశారు. 

గంధం చంద్రుడు అనే ఐఏఎస్ కు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇంతియాజ్ అహ్మద్ ను సెర్ప్ సీఈవోగా నియమించడంతో పాటు సిసిఎల్ఏ ఆపిల్ డైరెక్టర్ గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సుమిత్ కుమార్ ను మళ్లీ శ్రీకాకుళం జెసి గానే  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా జెసిగా బిఆర్ అంబేద్కర్ కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: