పీకలదాక మద్యం తాగి క్వాలిస్ వెహికిల్ నడుపుతున్న సంజయ్ (35) నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళ్తోన్న భార్యాభర్తలను వెనుకనుంచి ఒక్కసారిగా ఢీకొట్టాడు. కారులో కొంపల్లికి వెళ్లుతున్న సంజయ్.. కోకాపేట నుంచి బైక్ పై వస్తున్న దంపతులను ఢీ కొట్టాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులు దుర్గం రాజు, దుర్గం మౌనిక. బ్యాంకు పని నిమిత్తం ఇద్దరు వెళ్లి టీఎస్ 07 ఈజడ్ 6395 తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఎంజీఐటీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టడంతో బైకుపై వెళ్లుతుండగా వెనుక కూర్చున్న భార్య ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడింది. దీంతో మౌనిక తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
శంకర్పల్లి నుంచి గండిపేట వైపు నార్సింగి వెళ్లే రూటులో వెనుక నుంచి టాటాక్వాలిస్ దాదాపు 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంబులెన్స్ కానీ ఏ ఇతర వాహనం కాని రాలేదు.. అని మృతులు దుర్గం రాజు, మౌనిక దంపతుల మృతదేహాలు దాదాపు అరగంట సేపు అక్కడే పడి ఉండడం గమనార్హం. ఆ దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ అమాయక జనాలను ప్రాణాలను బలికొంటున్నారు మందుబాబులు. ఇప్పటివరకు కూడా పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన వద్ద సీసీ పుటేజీని విడుదల చేయకపోవడం గమనార్హం.