ఆమెను అత్యాచారం చేసి.. దారుణంగా హింసించారు. ప్రతిఘటించడంతో చావబాదారు. ఎముకలు కొరకే చలిలో.. భరించలేని బాధతో తన బిడ్డ ఏమైపోతాడో అనే ఆవేదనతో రాత్రి అంతా విలవిల్లాడిన ఆ తల్లి తెల్లారే సరికి మృత్యుఒడిలోకి చేరుకుంది. ఈ పాడు ప్రపంచంలో బ్రతకలేక శాశ్వతంగా నిద్రలోకి వెళ్లింది. ఎంత అమానుషం ఇది. నిర్భయ, దిశ ఘటన లాంటి ఘటనే అని చెప్పుకోవచ్చు. చంటి పిల్లోడు పక్కనే ఉన్నా.. ఆ మృగాళ్ల మనసులో జాలి కలగలేదంటే వారిని మనుషులు అనవచ్చో.. ఆ పసివాడి ఏడుపు వింటే రాళ్లు అయినా కరుగుతాయేమో కానీ.. ఆ కఠినాత్ములు మాత్రం అవేమి ఆలోచించలేదు. జంతువుల్లా మీదపడి వాంఛ తీర్చుకున్నారు.
కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎన్ని బాధలున్నాయో తెలియదు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలనుకుందో సమాచారం లేదు. బీహార్కు చెందిన ఓ మహిళ తన ఏడాదిన్నర వయస్సు ఉన్న బిడ్డతో డోన్ రైల్వే స్టేషన్ లో దిగింది. ఎక్కడికి పోవాలో తెలియక అక్కడే ఒంటరిగా ఉన్నది. ఇది అదునుగా భావించి మృగాళ్లు ఆ మహిళను పక్కకు లాక్కెళ్లి పాశవికంగా అత్యాచారా\నికి పాల్పడ్డారు. ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె ఉదయం మృతి చెందింది. సూర్యుడు ఉదయించే సిరిక ఎవ్వరూ తెలియని డోన్ రైల్వే స్టేషన్ అనాథ శవంలా మిగిలిపోయింది. ఆ మమిళ బాలుడిని శిశు సంరక్షణ కేంద్రముకు తరలించారు పోలీసులు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వేటాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ఇద్దరూ ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.