అస్సలు ఇప్పుడు బిగ్ బాస్ 2 లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో ఆడియన్స్ కు అర్ధం కాక తిక మక పడుతున్నారు. సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ 2 తేలిపోయిందని చెప్పాలి. హౌస్ లో జరిగే గొడవలు ప్రజలకు విరక్తి పుట్టిస్తున్నాయి. పైగా నాని హోస్టింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనితో రోజు రోజుకు బిగ్ బాస్ మీద ప్రజలకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది.
మొదట్లో నూతన్ నాయుడు, కిరీటి, కౌషల్, తనీష్, సామ్రాట్ తదితరుల మధ్య గొడవ చాలా ఇబ్బందికరంగా అన్పించింది. నూతన్ నాయుడు ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత తేజస్వి, హౌస్లో చేసిన గొడవలు అన్నీ ఇన్నీకావు. భానుశ్రీ సంగతి సరేసరి. భానుశ్రీ ఔట్ అయిపోయింది. తేజస్వి కూడా బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా వింతగా కన్పిస్తోంది. తేజస్వి ఎలిమినేషన్ సమయంలో నాని సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన్ని ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ట్రాల్ చేసేందుకు కారణమయ్యాయి.
బిగ్ హౌస్లో రకరకాల స్కిట్లు... అందులో లవ్ ట్రాక్లు.. ఇవేవీ ఆడియన్స్కి 'కిక్' ఇవ్వడంలేదు సరికదా, మరింత వెగటు పుట్టిస్తున్న మాటవాస్తవం. కిరీటి విషయంలో హోస్ట్ నాని చేసిన వ్యాఖ్యలతోనే నాని ఇమేజ్ బుల్లితెరపై దారుణంగా పడిపోయింది. కిరీటిని నాని బిగ్హౌస్కి సంబంధించి 'నేరస్తుడ్ని' చేసేశాడు. ఆ తర్వాత 'క్లీన్గా పంపిస్తున్నాం..' అని నాని చెప్పొచ్చుగాక.. కిరీటి పర్సనల్ ఇమేజ్ని నాని దారుణంగా దెబ్బకొట్టేశాడు. ఎన్టీఆర్ హోస్ట్గా వున్నప్పుడు ఇలాంటివేమీ జరగలేదు.