ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్ - పాక్ వైపే చూస్తున్నాయి. పుల్వామా దాడి తర్వాత పాక్ ఆక్రమిత ప్రాతంలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై భారత వైమానిక దళం ఒక్కసారే దాడి చేసింది. ఈ దాడిలో ఉగ్రవాదులు 300 మంది దారుణంగా హతమయ్యారు. దాంతో పాక్ సైతం భారత్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి కాల్పులు జరిపింది.
ఈ నేపథ్యంలో అభినందన్ అనే వైమానిక కమాండర్ పాక్ కి బంధీ అయ్యారు. నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మన సైనికుడు అభినందన్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే..ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే, తాను ప్రాణత్యాగానికి సిద్ధమని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చెబుతోంది.
పంజాబ్ లోని లూథియానాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాఖీ సావంత్ మాట్లాడుతూ..భారతమాత కోసం తాను చనిపోవడానికి సిద్ధమని చెప్పింది. తనకు 50 నుంచి 100 బాంబులు ఇస్తే, శత్రు శిబిరాల్లోకి దూసుకెళ్లి, వారిని మట్టుబెట్టి వస్తానని వెల్లడించింది. పుల్వామా దాడికి మోదీజీ సరైన సమాధానం ఇచ్చారు.