శృతిహాసన్ అనుమతి లేకుండా తన ఫోటోలను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన వారిపై కేసులు పెడతానని సంచలన వ్యాఖ్యలు శ్రుతి హసన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఎవడు’ చిత్రంలోని 'పింపుల్ డింపుల్' సాంగ్ చేస్తున్నడు తీసిన కొన్ని హాట్ ఫోటో లను వెబ్ మీడియాలో ఎవరో కావాలని అప్ లోడ్ చేసారు అనేది శ్రుతి వాదన. డాన్స్ చేస్తున్నప్పుడు టాప్ యాంగిల్ లో తీసిన ఆ ఫోటోలు అసభ్యంగా ఉన్నాయి కాబట్టి అలాంటివాటిని డిలీట్ చేసేస్తూంటారని, అయినా ఆ ఫోటోలు బయిటకు ఎలా వచ్చాయో అర్దం కావటం లేదని శృతిహాసన్ రెచ్చిపోయిన విషయం పాత విషయం. అయితే పోలీసులకు కంప్లయింట్ ఇస్తాను అని శ్రుతి చెప్పిన విషయంలో ఈ ఫోటోలకు సంబంధించిన విషయంలో సినిమా నిర్మాత దిల్ రాజ్ పేరు కొన్ని వెబ్ మీడియా సైట్లలో బయటకు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఫోటోలు లీక్ వెనక ‘ఎవడు' చిత్ర నిర్మాత దిల్ రాజు హస్తం ఉందనే గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి అంటూ కొన్ని వార్తలు వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం ఇలాంటి ఫోటోలు నిర్మాత ఆధీనంలోనే ఉంటాయని, ఆయనే వాటిని వెబ్ సైట్లకు విడుదల చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అయితే ఇందులో ఎన్ని నిజాలో ఎవరికీ పరిపూర్ణంగా తెలియదు. దిల్ రాజ్ లాంటి ఒక ప్రముఖ వ్యక్తి ఇలాంటి విషయాలు చేయరనీ ఎవరో దిల్ రాజ్ అంటే గిట్టని వ్యక్తులు ఇటువంటి నెగిటివ్ ప్రచారాలను చేస్తున్నారని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: