డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా గతేడాది నుంచి షూటింగ్ నిలిచిపోతూ వస్తోంది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. అయితే గత ఏడాది ఇదే మే నెలాఖరున ప్రీ లుక్ తోనే సెన్సేషన్ సెట్ చేసిన మహేష్.. ఈ సారి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నాడు.

మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా ఎప్పటి నుంచో ఊరిస్తున్న మేకింగ్ వీడియో కూడా రావడం ఖరారు అయ్యినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతకుముందు కరోనా కారణంగా కృష్ణ బర్త్ డేకు ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉండవని తెలిసింది. కానీ ఆ అనుమానాలను పక్కన పెడుతూ కచ్చితంగా ఫ్యాన్స్‌కు అలరించాలని మహేష్ అండ్ టీం భావిస్తున్నారట. అంటే కచ్చితంగా ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోతో ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తాడట.

అయితే మేకింగ్ వీడియో విషయం చిత్ర బృందం చాలా జాగ్రత్తగా ఉందట. ఇప్పటివరకు పూర్తయిన షూట్‌కు సంబంధించి కొన్ని సీన్స్‌ను పర్ఫెక్ట్‌గా కట్‌ చేసి టీజర్‌పై మరిన్ని అంచనాలు పెంచాలని అనుకుంటోందట. ఈ మేరకు పక్కా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థమన్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ కానుందని టాక్. మైత్రి మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: