ప్రమాదం జరిగిన కొద్దికాలానికే ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2021ను ప్రెజెంట్ చేయడానికి లండన్ నుండి లాస్ ఏంజెల్స్ కి వచ్చారు. ఆ సమయంలో ఆమె భర్తపై ప్రశంసలు కురిపించింది. "ప్రకృతి ఫోర్స్ ను ఏదీ ఆపలేదు. మీరు చేసే ప్రతి పనితో, మీ గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బేబీ. మీ పని కోసం మీరు చేసే కృషి అద్భుతం. ప్రతిరోజూ మీరు నన్ను ప్రోత్సహిస్తారు. ఐ లవ్ యూ సో మచ్" అంటూ జరిగిన ప్రమాదం గురించి స్పందించింది. కాగా ప్రియాంక ఇటీవల రాజ్ కుమార్ రావు, ఆదర్ష్ గౌరవ్ ల చిత్రం 'ది వైట్ టైగర్'లో, ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్లతో కలిసి షోనాలి బోస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది స్కై ఈజ్ పింక్' లో కనిపించింది. ఆమె తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ నటి ప్రస్తుతం లండన్లో తన రాబోయే హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం షూటింగ్ లో పాల్గొంటోంది.
ప్రమాదం జరిగిన కొద్దికాలానికే ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2021ను ప్రెజెంట్ చేయడానికి లండన్ నుండి లాస్ ఏంజెల్స్ కి వచ్చారు. ఆ సమయంలో ఆమె భర్తపై ప్రశంసలు కురిపించింది. "ప్రకృతి ఫోర్స్ ను ఏదీ ఆపలేదు. మీరు చేసే ప్రతి పనితో, మీ గురించి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బేబీ. మీ పని కోసం మీరు చేసే కృషి అద్భుతం. ప్రతిరోజూ మీరు నన్ను ప్రోత్సహిస్తారు. ఐ లవ్ యూ సో మచ్" అంటూ జరిగిన ప్రమాదం గురించి స్పందించింది. కాగా ప్రియాంక ఇటీవల రాజ్ కుమార్ రావు, ఆదర్ష్ గౌరవ్ ల చిత్రం 'ది వైట్ టైగర్'లో, ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్లతో కలిసి షోనాలి బోస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది స్కై ఈజ్ పింక్' లో కనిపించింది. ఆమె తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ నటి ప్రస్తుతం లండన్లో తన రాబోయే హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం షూటింగ్ లో పాల్గొంటోంది.