106 చిత్రాల విశేష అనుభవం నందమూరి బాలకృష్ణది. ఇటీవల అఖండ చిత్రంతో టైటిల్ కి తగ్గ అఖండ విజయాన్ని సాధించారు బాలయ్య. వరుసగా భారీ ప్రాజెక్టుల తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అల్లుఅరవింద్ సారథ్యంలోని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో హోస్ట్ గా మెస్మరైజ్ చేస్తున్నాడు. టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైనా స్టైల్ లో ఇంటర్వ్యూ చేస్తూ  ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ షో భారీ ఆదరణ పొందుతోంది. నటరత్న ఎన్టీరామారావు కు వారసుడిగా అరంగేట్రం చేసిన బాలయ్య టాలీవుడ్ లో ఫ్యాన్స్ ని నటసింహం గా అలరిస్తున్నారు.

 ఆదిత్య 369, భైరవద్వీపం, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. గతంలో తన ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సంఘటనలో విమర్శలు ఎదుర్కొన్నారు బాలయ్య. నిర్మాత బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి లపై బాలయ్య కాల్పులు జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొందరు పై బాలయ్య చేయి చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు బాలయ్య బాబు.

వీటన్నింటికీ మించి మాస్ మహారాజా రవితేజను ఇంటికి పిలిచి చేయి చేసుకున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ఎప్పుడో ట్రోల్ అయిన ఈ పుకారును ఇటీవల ఖండించారు బాలయ్య. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు. అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా రవితేజని ఆహ్వానిస్తూ బాలయ్య బాబు ఈ రూమర్స్ ని స్పష్టంగా తిరస్కరించారు. ప్రతివాడు సోషల్ మీడియాలో ఏమని పిస్తే అది రాస్తున్నాడని పేరు లేని,లొకేషన్ తెలియని అడ్రస్ లతో ఫేక్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు బాలయ్య. ఆపరేషన్ జరిగిన తన లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందని ఇలాంటి వారి దొరికితే దవడ పగలగొడతానని హెచ్చరించారు బాలకృష్ణ. ఈ వార్నింగ్ తో ఆయన ఫేక్ కామెంట్స్ చేసేవాళ్ళు బుద్ధిగా ఉంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: