మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా అంటే హీరోయిన్ గా చేసేందుకు భయపడుతున్నారు. అదేంటి త్రివిక్రం సినిమాలో హీరోయిన్ అంటే స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుంది కదా మరి అలాంటిది త్రివిక్రం సినిమాలో ఛాన్స్ అంటే ఎందుకు వెనకడుగు వేస్తుకున్నారు అంటే త్రివిక్రం డైరక్షన్ లో హీరోయిన్ గా కాదు సెకండ్ హీరోయిన్ గా చేసేందుకు హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది.

త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన జులాయి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఇలియానా నటించగా సెకండ్ హీరోయిన్ గా పార్వతీ మెల్టన్ నటించింది. ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. ఇక అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ గా ప్రణతి చేసింది. ఆమె కూడా తెలుగులో పెద్దగా క్లిక్ అవలేదు. ఇక సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అదా శర్మ కూడా సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆమె కూడా అడ్రెస్ లేకుండా పోయింది. ఈ క్రమంలో అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ నటించగా అమ్మడికి లక్ కలిసి రాలేదు. అరవింద సమేత సినిమాలో ఈషా రెబ్బ సెకండ్ హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాతో అమ్మడు పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత అల వైకుంఠపురములో నివేదా పేతురాజ్ కూడా సెకండ్ హీరోయిన్ గా చేసింది.

సినిమాలైతే భారీ విజయాన్ని అందుకున్నా త్రివిక్రం సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అంటే మాత్రం కెరియర్ మీద చాలా ఎఫెక్ట్ పడేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం త్రివిక్రం మహేష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ ఉంటుందని టాక్. మరి ఈ సినిమాలో ఎవరు ఆ ఛాన్స్ అందుకుంటారో చూడాలి. అయితే త్రివిక్రం సినిమా సెకండ్ హీరోయిన్ బ్యాడ్ సెంటిమెంట్ వల్ల మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: