రవితేజ హీరోగా నటించిన కిలాడి చిత్రం వాయిదా పడుతుందని వార్తలు మరోవైపు వాయిదా పడటం లేదు అనే వార్తలు మరొకవైపు వినిపిస్తున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను భారీస్థాయిలో అలరిస్తుందని మొదటి నుంచి యూనిట్ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా చూసి తరించాలని అందరూ భావించారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హాయథి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో చేస్తోంది.

యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో ప్రతినాయకుడు గా నటిస్తుండగా క్రాక్ సినిమా లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే దర్శకుడు రమేష్ వర్మ నిర్మాత ఓ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది. రవితేజ యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ రావడంతో నిర్మాత ఆ క్రేజ్ ను వాడుకోవడం కోసం ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నాడు.

అయితే విడుదలకు ఇంకా నాలుగైదు రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు చిన్న అయోమయం నెలకొంది. అయితే ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడం రవితేజకు అస్సలు ఇష్టం లేదని నిర్మాత బలవంతం మీదనే ఈ చిత్రం విడుదల అవుతుందని కొంతమంది చెబుతున్నారు అయితే కరోనా సాకుగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారని చెప్పడం వెనుక అసలైన కారణం ఇది అని సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: