రవితేజ హీరోగా నటించిన కిలాడి చిత్రం వాయిదా పడుతుందని వార్తలు మరోవైపు వాయిదా పడటం లేదు అనే వార్తలు మరొకవైపు వినిపిస్తున్నాయి. రమేష్
వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను భారీస్థాయిలో అలరిస్తుందని మొదటి నుంచి యూనిట్ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో
ఫిబ్రవరి 11వ తేదీన విడుదల అవుతున్న ఈ
సినిమా చూసి తరించాలని అందరూ భావించారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హాయథి
హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో
అనసూయ కూడా ఓ కీలక పాత్రలో చేస్తోంది.
యాక్షన్
కింగ్ అర్జున్ ఇందులో ప్రతినాయకుడు గా నటిస్తుండగా
క్రాక్ సినిమా లాంటి భారీ
బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత
రవితేజ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ
సినిమా విడుదలకు ముందే దర్శకుడు రమేష్
వర్మ నిర్మాత ఓ కారును
గిఫ్ట్ గా ఇచ్చాడు. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది.
రవితేజ యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ రావడంతో
నిర్మాత ఆ క్రేజ్ ను వాడుకోవడం కోసం ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నాడు.
అయితే విడుదలకు ఇంకా నాలుగైదు రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. దాంతో ఈ
సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు చిన్న అయోమయం నెలకొంది. అయితే ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడం రవితేజకు అస్సలు ఇష్టం లేదని
నిర్మాత బలవంతం మీదనే ఈ చిత్రం విడుదల అవుతుందని కొంతమంది చెబుతున్నారు అయితే
కరోనా సాకుగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారని చెప్పడం వెనుక అసలైన కారణం ఇది అని సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు.