అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఘన విజయం సాధించింది.  పోయిన ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా విడుదలై ఏడు నెలలు అయిన తర్వాత కూడా పుష్ప సీక్వెల్ చిత్రాన్ని మొదలు పెట్టక పోవడం బన్నీ అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. వాస్తవానికి అల్లుఅర్జున్ షూటింగ్ చేసి చాలా నెలలు అయిపోయింది అని చెప్పాలి. పోయిన ఏడాది సెప్టెంబర్ లో పుష్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన అల్లు అర్జున్ మళ్ళీ  ఇప్పటిదాకా ఆయన షూటింగ్ లో పాల్గొన లేదు.

 దాదాపు ఎనిమిది నెలలుగా  ఆయన ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనకుండా ఖాళీగా ఉన్నాడు. పుష్ప సినిమా విజయోత్సాహంలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఈ గ్యాప్ లో ఓ సినిమా చేస్తే బాగుండేది అని చెబుతున్నారు. పుష్ప సినిమా వాస్తవానికి అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టిన కూడా ఇంత పెద్ద హిట్ సినిమా తర్వాత ఇంతటి గ్యాప్ రావడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. కనీసం అప్పటికే ఒప్పుకుని ఉన్న వేణు శ్రీరామ్ తో సినిమా చేసి ఉంటే బాగుండేది అని బన్నీ అభిమానులు ఆయనకు సూచిస్తున్నారు.

పుష్ప లాంటి భారీ హిట్ సినిమా తర్వాత కూడా ఆరు నెలలు ఆయన ఖాళీగా ఉండడం  ప్రేక్షకులను ఏమాత్రం నచ్చడం లేదు. ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసి ఉంటే బాగుండేది అని వారు చెబుతున్నారు. మరి త్వరలోనే పుష్ప యొక్క రెండో భాగం సినిమా న చిత్ర బృందం మొదలు పెట్టబోతున్నగా  ఈ సినిమా తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అని అంటున్నారు. గతంలో సరైనోడు వంటి ఈ సినిమా చేసిన  ఈ కాంబో కి ఈ సినిమా వీరిద్దరికీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనేది చూడాలి.  ఇప్పుడు బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో కలిసి సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: