కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ ఈ సంవత్సరం ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది. బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో వరిసు అనే టైటిల్ తో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత దళపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉండగానే , ఈ మూవీ పై అనేక రూమర్ లు   పుట్టుకొస్తున్నాయి.  తాజాగా దళపతి విజయ్ ,  లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో ప్రేమమ్ మూవీ హీరో నివిన్ పౌలే ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో తమిళ హీరో విశాల్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: