నందమూరి వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు బలయ్యే.  ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తనకంటూ స్టార్ హీరో అని గుర్తింపును పొందాడు. అయితే గత కొంతకాలంగా బాలయ్య నటించిన సినిమాలు అంతటి విజయాన్ని అందులో అందుకోలేకపోయాయి. అయితే 2021లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అఖండ సినిమా నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతోపాటు కాసుల వర్షాన్ని కూడా కురిపించింది. ఎవరు ఊహించిన విధంగా విజయాన్ని అందుకున్న ఈ సినిమా. అప్పట్లో టాలీవుడ్ లోని సెన్సేషన్ గా నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు అఖండ సినిమా బాలీవుడ్ లో కూడా సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.అయితే ఈ విషయాన్ని తాజాగా బీటౌన్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ చెప్పడం జరిగింది.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాని కూడా హిందీలో రిలీజ్ చేసింది ఈ సంస్థ. అయితే తాజాగా ఈ సంస్థ గురువారం ఈ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఇప్పటికే తెలుగులో 120 కోట్లకు పైగానే సంపాదించింది. ఓటీటిలో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను కనబరిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా జనవరి 24 లో కూడా విడుదల కానుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు మూవీ మేకర్స్. సౌత్ లో లభించిన ఆధారాభిమానాలే నార్త్ లో కూడా ఈ సినిమాకి లభించాలని అందరూ భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: